Ayyppa Swamy History In Telugu | అయ్యప్ప స్వామి చరిత్ర: శబరిమల మహత్యం |

Ayyappa swamy history in telugu

Ayyppa Swamy History In Telugu (శబరిమల పరిచయం): కేరళలోని పతనం తిట్ట జిల్లాలోని సహ్యాద్రి కొండల నడుమ ఉన్న శబరిమల, కేరళలో అత్యంత ప్రసిద్ధి గాంచిన ఆలయాలలో ఒకటి. ఇది 4,135 అడుగుల ఎత్తులో ఉన్న ఆలయం. అయ్యప్ప స్వామిని మణికందన్ లేదా మణికంఠన్ అని పిలుస్తారు. హరిహర పుత్రుడిగా పిలవబడే అయ్యప్ప, మహావిష్ణువు మోహినీ రూపం మరియు శివుడి కలయికలో పుట్టినవారు.

Table of Contents

Ayyppa Swamy History In Telugu అయ్యప్ప స్వామి చరిత్ర: శబరిమల మహత్యం

అయ్యప్ప స్వామి అవతార నేపథ్యం

మహిషి రాక్షసి వరదానం (Ayyppa Swamy History In Telugu):

మహిషాసురుని సోదరి మహిషి, తన సోదరుని హత్య చేసిన దేవతలపై ప్రతీకారం తీర్చుకోవాలని సంకల్పించి బ్రహ్మదేవుడికి తపస్సు చేసింది.బ్రహ్మ వరప్రసాదంగా ఆమెకు, శివుడు మరియు విష్ణువు కలయికలో పుట్టిన కుమారుడితో మాత్రమే చావు కలుగుతుందని వరమిచ్చాడు ఈ వరంతో మహిషి, దేవతలపై యుద్ధం ప్రారంభించి, వారు స్వర్గాన్ని విడిచిపెట్టే పరిస్థితి తెచ్చింది.

ayyappa swamy history in telugu - Mahishi's Boon

భస్మాసురుడు, మరియు విష్ణు మోహినీ అవతారం:

ఇది ఇలా ఉండగా మరో రాక్షసుడు భస్మాసురుడు, శివుడి కై తపస్సు చేసి, ఎవరి తల మీద అయితే చేయి పెడితే వారు బూడిదవుతారనే వరం పొందాడు.ఆ వరం శివుడి మీద ప్రయోగించాలి అని ప్రయత్నిస్తాడు,శివుడి ప్రాణాలకు ముప్పుగా మారిన భస్మాసురుడిని విష్ణువు, మోహినీ అవతారం ద్వారా మోసగించి, అతని చేత అతనే బూడిద కావించాడు.

Ayyappa swamy history in telugu-Lord Shiva Boon to Bhasmashura

శివుడు మరియు మోహినీ కలయిక:

శివుడు, మోహినీ రూపంలో ఉన్న విష్ణువును ఆకర్షించడంతో, వీరి కలయిక ద్వారా ధర్మశాస్త్రుడు జన్మించాడు.హరి (విష్ణువు) మరియు హర (శివుడు) నుండి పుట్టిన ఆయన హరిహర పుత్రుడు అయ్యాడు.

Ayyappa Swamy History In Telugu - Lord Shiva And Mohini

మణికందన్ జననం మరియు బాల్యం

పండలం రాజు రాజశేఖరుడు:

పాండ్య రాజుల వారసుడు అయిన రాజశేఖరుడు, పండలం ప్రాంతాన్ని పాలించేవారు.సంతానం లేని రాజు, తమకు సంతానం కలగాలని శివుడిని ప్రార్థించే వారు. వారి ప్రార్థనలకు ధర్మశాస్తా ద్వారా సమాధానం ఇవ్వాలని శివుడు నిర్ణయించుకున్నాడు. ధర్మ శాస్తా  ను శిశువుగా పుట్టి మండలంలో పెరగాలని శివుడు ఆదేశించాడు. శివుడు ధర్మశాస్త్రుడిని పంచభూతాలు మేళవించిన పంపానది తీరాన వదిలివేసాడు. ఒకరోజు రాజశేఖరుడు వేటకని అడవిలో వెళుతుండగా, అతను అలసిపోయి విశ్రాంతి కని ఒక ప్రదేశంలో ఆగాడు. అప్పుడు ఒక చిన్నారి ఏడుస్తున్న శబ్దం అతని చెవిన పడింది. అతను చుట్టుపక్కల అంతా వెతికి చూడగా ఒంటరిగా ఉన్న ఒక అందమైన మగ శిశువుని చూశాడు. శిశువు మెడలో ఒక బంగారు గంట కట్టబడి ఉంది. ఈ శిశువు నీ చూసిన రాజు ఆశ్చర్యపోయాడు.

Ayyappa swamy history in telugu-Manikanta birth

ఈ శిశువుతో ఏమి చేయాలో రాజుకి అర్థం కాలేదు, అప్పుడు అటుగా వెళుతున్న ఋషి ఈ శిశువు చాలా దివ్యమైన వాడని రాజుతో అన్నాడు. మరియు ఇతను ఆ శివుని యొక్క ఆశీర్వాదమని, తను శివుడిని ప్రార్థించినది గుర్తుచేసుకోమని తెలియజేశాడు. ఈ శిశువు సాధారణ మానవుడు కాదు, భగవంతుడి అవతారమని ఆయన అన్నారు.

మెడలో గంట కట్టినందున, శిశువుకు “మణికందన్” అనే పేరుని పెట్టి రాజ్య భవనానికి తీసుకువెళ్లి పెంచమన్నాడు. బాలుడికి 12 ఏళ్లు వచ్చినప్పుడు తన జన్మ యొక్క ఉద్దేశాన్ని రాజుకి అర్థం అవుతుంది అని రుషి చెప్పాడు.

రాజు చాలా సంతోషంగా బిడ్డను రాజ్య భవనానికి తీసుకెళ్లి పెంచాడు. రాజుకు ఇప్పుడు వారసుడు ఉన్నాడని రాణి మరియు రాజ్యంలోని ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారు.

అదే రాజ్యంలో రాజుకి చెందినటువంటి ఒక మంత్రి రాజుకి బిడ్డలు లేరు ఇక తొందరలో రాజ్యాన్ని తానే చేజికించుకోవాలని అనుకున్నాడు, కానీ ఇప్పుడు రాజుకి వారసుడు ఉన్నాడని ఆందోళనకు గురయ్యాడు.

గురుకుల విద్యాభ్యాసం:

మణికందన్ పెద్దయ్యాక రాజు అతన్ని గురుకులానికి విద్యాభ్యాసానికై పంపాడు.అక్కడ మణికందన్ గురుకులంలో విద్య అభ్యసించి, అసాధారణమైన ప్రతిభ చూపాడు. తన చదువు పూర్తయిన తర్వాత తన గురువుకు, గురుదక్షిణ ఇవ్వాలని మణికంఠుడు అనుకున్నాడు.గురుదక్షిణగా తన గురువు మూగ కుమారుడికి మాటలెరిపించాడు, దీన్ని చూసి గురువు ఆశ్చర్యపోయాడు.

Ayyappa swamy history in telugu

మహిషి వధ మరియు అయ్యప్ప స్వామి అవతార ధ్యేయం

రాణి కుట్ర:

కొన్ని సంవత్సరాల తర్వాత, రాణి మరొక మగ బిడ్డకు జన్మనిచ్చింది. అతడికి రాజరాజన్ అనే పేరుని పెట్టారు. రాజు పెద్ద కుమారుడిగా మణికందుని పట్టాభిషేకం చేయాలని భావించాడు, అందుకు తగిన ఏర్పాట్లను చేయాలని మంత్రిని ఆదేశించాడు. కానీ, అప్పటికే మణికంఠుడి పైన ద్వేషం పెంచుకున్న మంత్రి దీనికి ఇష్టపడలేదు. అతను రాని వద్దకు వెళ్లి రాణి మనసు మార్చేలా చేసి, రాజుకి వ్యతిరేకంగా వెళ్లేలా చేశాడు. ఈ రాజ్యానికి వారసుడిగా అయ్యే అవకాశం కేవలం రాజరాజనికి మాత్రమే ఉంది, ఎందుకంటే అతడే మీకు జన్మించినటువంటి వాడు అని అతను రాణి కి చెప్పాడు.

ఆతడి మాటలను నమ్మినటువంటి రాణి, అతడిని అనుసరించడం మొదలుపెట్టింది. ఈ నింద రాణి మీద పడకుండా మణికంఠుడిని చంపే పని అతడే చూసుకుంటానని రాణి కి చెప్పాడు. ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి ఉన్నట్లు నటించమని మంత్రి చెప్పాడు. అతడి మాటలను అనుసరించి, భరించలేనటువంటి కడుపునొప్పి ఉన్నట్లు నటించడం మొదలుపెట్టింది.

రాణి నొప్పి తగ్గడానికి ఉన్న ఏకైకమందు ఆడపులి యొక్క పాలు అని చెప్పేలా మంత్రి ఒక వైద్యుడిని ఏర్పాటు చేశాడు. దీనికోసం రాజు తన సైనికులను అడవికి పంపాలని ఆలోచనలో ఉండగా, మణికంఠుడు తనే వెళ్తానని ముందుకు వచ్చాడు. దీనికి రాజు నిరాకరించాడు, కానీ మణికంఠుడు మాత్రం తనే అడవికి వెళ్తానని పట్టుబట్టి కూర్చున్నాడు. ఇంకా రాజు చేసేదేమీ లేక మణికంఠుడిని ఒంటరిగా అడవికి పంపించాడు.

మహిషి వధ:

మణికంఠుడికి అడవిలో వెళ్లేటప్పుడు తన జన్మ యొక్క ఉద్దేశం ఏంటో అర్థమైంది.. మహిషిని సంహరించడమే తన ప్రధాన ఉద్దేశమని గ్రహించారు. పాండలం రాజ్యంలో మహిషి దేవతలకు ఇబ్బందులు కలిగిస్తూ ఉండగా, అయ్యప్ప ఆమెతో భయంకరమైన యుద్ధం చేసి మహిషి ని సంహరించాడు.అయ్యప్ప స్వామి మహిషి తో యుద్దం చేస్తున్న సమయం లో శివుడు పార్వతి సమేతంగా వృషభ వాహనంతో భూమికి వచ్చారు. శివుడు దగ్గర్లో ఉన్న ఒక చెట్టుకి తన వాహనమైనటువంటి నందిని కట్టేసి, మణికంఠుడు మహిషితో పోరాడటం చూశాడు. ఆయన నందిని కట్టేసిన ప్రదేశాన్ని కాలైకట్టి అని పిలుస్తారు, ఇది శబరిమలకి వెళ్లే మార్గంలో అలుధ అనే నది ఒడ్డున ఉంది. ప్రెసెంట్ అయితే మనం అక్కడ ఒక శివాలయాన్ని చూడవచ్చు. మణికంఠుడు మహిషిని సంహరించి అక్కడే నేలపైన పడేశాడు. ఆమె మళ్ళీ ఎక్కడ సజీవంగా వస్తుందనే అనుమానంతో ఆమెపైకి పెద్ద పెద్ద రాళ్లను విసిరేసాడు అయ్యప్ప. ఈ ప్రదేశాన్ని అలుదా కొండపై కల్లిడుం కుండ్రు అని అంటారు, ఇప్పటికీ యాత్రికులు అలూధా నదిలో ఒక రాయిని తీసుకొని మహిషి ఓటమిని సూచిస్తూ ఈ ప్రదేశంలో పడేస్తారు.

మహిషి చనిపోయిన తర్వాత, మణికంఠ ఆమె ఆత్మకు శాంతి చేకూర్చి స్వర్గానికి చేరుకోమని ఆశీర్వదించాడు. మహిషి తనని వివాహం చేసుకోమని మణికంఠ ని కోరింది, కానీ అందుకు అయ్యప్ప ఈ భూమి మీద తన జననానికి ఉద్దేశం వేరే ఉందని తను ఒక బ్రహ్మచారిగా ఉంటానని అన్నాడు. కానీ మహిషి పట్టు పట్టడంతో, ఆయనను చూడటానికి ఏ రోజు అయితే కొత్త భక్తుడు రాకుండా ఉంటాడో ఆరోజు తనని వివాహం చేసుకుంటాను అంతవరకు నాకోసం నిర్ణయించిన అడవిలో నువ్వు నివసించవచ్చు అని అన్నాడు. అప్పటినుండి ఆమె మలిగపురత్తమ్మ అనే పేరుతో అయ్యప్ప స్వామి సన్నిధానానికి సమీపంలో నివసించి ఉంది.

Ayyappa swamy history in telugu-Ayyappa swamy fighting with mahishi

అందుకని ఆమె ప్రతిరోజు, కొత్త భక్తుడు రాకూడదని ఎదురు చూస్తూనే ఉంది, కానీ ఇది ఇంతవరకు జరగలేదు . ఎందుకంటే ప్రతి సంవత్సరం, వేలాదిమంది కన్నె సామిలు శబరిమలకు వస్తారు. తమ సందర్శనకు గుర్తుగా వారు సగం అనే పదునైన వెదురు కర్రను తీసుకొచ్చి, సరం కుటి అనే ప్రదేశంలో ఒక చెట్టు పైన పెడతారు. చెట్టుమీద ” సరం ” లేనప్పుడు అయ్యప్ప ఆమెను వివాహం చేసుకుంటాడని నమ్ముతారు.

పులులపై రాజభవనానికి పయనం:

మణికంఠుడు మహిషిని చంపిన తర్వాత, శివుడు మరియు దేవతలందరూ, అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంద్రుడు ఇంకా అందరూ దేవతలని పులులుగా మారమని శివుడు అజ్ఞాపించాడు. పులులుగా మారిన దేవతలందరితో కలిసి అయ్యప్ప ఒక పులి మీద కూర్చొని రాజ్యానికి తిరిగి బయలుదేరాడు. ఇది చూసిన రాజభవనంలోని అందరూ భయభ్రాంతులకు గురయ్యారు.

Ayyappa swamy history in telugu-Lord ayyappa on tiger

మణికంఠుడు సాధారణ పిల్లవాడు కాదని రాజశేఖరుడు గ్రహించాడు. అప్పుడు ఆయనకి అడవిలో ఋషి చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి. మణికంఠుడికి 12 సంవత్సరాలు వయస్సు వచ్చినప్పుడు అతను పుట్టిన ఉద్దేశం అర్థం అవుతుందని గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు మణికంఠుడికి 12 సంవత్సరాలు. రాణి మరియు మంత్రి తమతప్పులని గ్రహించి, క్షమాపణ కోసం మణికంఠ ని పాదాల వద్ద పడ్డారు.ఇక్కడ మీ తప్పు ఏమి లేదు అని , అంతా దేవుని ఆశీర్వాదంతోనే జరిగిందని మణికంఠుడు చెప్పాడు. రాజశేఖరుడు సింహాసనాన్ని అధిష్టించాలని అయ్యప్పను కోరాడు. కానీ అందుకు మణికంఠుడు మర్యాదగా నిరాకరించి, రాజు కావడం తన జీవిత ఉద్దేశం కాదని రాజుతో చెప్పాడు.

శబరిమల ఆలయం నిర్మాణం

భూమిపైన తను చేయవలసిన కర్తవ్యం ముగిసింది, ఇక కైలాసానికి తిరిగి వెళ్లడానికి తపస్సు చేయాలి అనుకుంటున్నానని ఆయన అన్నారు. ఇంకా రాజు చేసేదేమీ లేక అయ్యప్పకు ఆలయాన్ని కట్టే అవకాశాన్ని అయినా ఆయనకు కల్పించమని కోరాడు. మణికంఠుడు తన విల్లును తీసుకుని బాణం పడే ప్రదేశంలో తను తపస్సు చేస్తూ ఉంటానని చెప్పి బాణం వేశాడు. అక్కడ కావాలంటే మీరు నాకు ఆలయాన్ని కట్టించవచ్చు అని అన్నాడు.

మణికంఠుడు వేసిన బాణం, అప్పటికే పవిత్ర స్థలంగా పేరుపొందిన శబరిమలై అనే ప్రదేశానికి వెళ్లి పడింది. అక్కడ రామ భక్తురాలైన శబరి అనే వృద్ధురాలు నివసించేది. ఆమె ఎప్పుడూ రాముని జపం చేస్తూ ఆయనని జీవితంలో ఒక్కసారి అయినా కలవాలి అని కోరుకునేది. రాముడు ఆమెను ఈ కొండమీదనే కలుసుకొని ఆమె యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాడు. సబరీ ఈ కొండమీద నివసించడం వలన, దీనికి శబరిమలై అనే పేరు వచ్చింది .

ఆలయ ప్రతిష్ఠ:

గంగా నది లాగా పవిత్రమైన పంపానది సమీపంలో శబరిమల నుండి భక్తులను ఆయన ఆశీర్వదిస్తారు. అయ్యప్పను రాజుగా చూడాలని రాజశేఖరుడు ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు, కానీ అయ్యప్పను కాషాయ దుస్తులతో సన్యాసిగా చూసి రాజశేఖరుడు చాలా బాధపడ్డాడు.

అందుకు ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున అన్ని దుస్తులు ,ఆభరణాలు ,ఆయుధాలను అలంకరించుకొని ప్రపంచానికి ఒక రాజుగా దర్శనాన్ని ఇస్తానని అయ్యప్ప రాజశేఖరుడికి మాట ఇచ్చాడు. ఆరోజు ఆయన ఒక జ్యోతి రూపంలో భక్తులందరికీ దర్శనమిస్తానని అన్నారు. దీని తర్వాత, అయ్యప్ప తన దేవలోకానికి ప్రయాణం కోసం శబరిమలకు చేరుకున్నారు. తరువాత, అగస్తియార్ మహర్షి సలహా మేరకు, రాజశేఖరుడు శబరిమలలో అయ్యప్ప మందిరం కోసం పునాదిని వేశారు.

ఆలయంలో అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్టించడానికి రాజు పరుశురాముడి సహాయం తీసుకున్నారు, మరియు మకర సంక్రాంతి రోజున విగ్రహ ప్రతిష్ట చేశారు.

అయ్యప్ప స్వామి మహిమ

శబరిమల యాత్ర మార్గాలు:

  • పంపా నది నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న మార్గం
  • ఎరుమేలి నుండి 48 కిలోమీటర్ల నడక మార్గం.
  • ఫుల్ మేడు అనే తీరప్రాంతం మార్గం.
Ayyappa swamy history in telugu-River-Pampa

18 మెట్లు:

  • గర్భగుడికి చేరుకునే 18 మెట్లు, భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సూచిస్తాయి. వీటిని కేవలం ఇరుముడి ఉన్న వాళ్లు మాత్రమే ఎక్కడానికి అవకాశం ఉంటుంది. మిగతావారు పక్కనుండి వెళ్లాల్సి వస్తుంది.
  • ఈ మెట్లు, 5 ఇంద్రియాలు, 8 రాగాలు, 3 గుణాలు, విద్య మరియు అవ్యయాలను సూచిస్తాయని నమ్ముతారు.

మకరజ్యోతి:

  • ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున, అయ్యప్ప స్వామి ఒక దివ్యజ్యోతి రూపంలో దర్శనం ఇస్తారు.
  • ఈ పర్వదినం శబరిమల యాత్రలో ముఖ్య ఘట్టం.

అయ్యప్ప స్వామి భక్తుల నియమాలు:

  • భక్తులు 41 రోజుల పాటు పూర్తి స్థాయి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి.
  • తలపై ఇరుముడి (పూజా సామగ్రితో కూడిన సంచి) తీసుకెళ్లాలి.
  • తత్వ జ్ఞానంతో, ప్రాపంచిక సంబంధాలను వదిలి, భక్తితో యాత్ర కొనసాగించాలి.

నిరంతర దేవోత్తమ సేవ:

అయ్యప్ప స్వామి భక్తులందరికీ సర్వశక్తిమంతుడి కృపను ప్రసాదిస్తారు. ఆయన పూజా విధానాలు, నిరంతర ఆధ్యాత్మిక చింతనతో భక్తులను విశ్వసాంతిని చేకూరుస్తాయి.

స్వామియే శరణం అయ్యప్ప!

“అయ్యప్ప-వావర్ స్నేహం: మతసామరస్యానికి ప్రతీక”

వావర్ అనే ముస్లిం యోధుడు ఒకసారి అయ్యప్ప స్వామితో యుద్ధానికి దిగాడని చెబుతారు. ఆ యుద్ధంలో అయ్యప్ప తన ధైర్యం, దయతో వావర్‌ను ఓడించాడు. అయితే, వావర్ అయ్యప్ప స్వామి యొక్క మహాత్మ్యాన్ని గుర్తించి, ఆయన శరణు పొందాడు. ఆ తర్వాత, వావర్ అయ్యప్పకు నిజమైన మిత్రుడిగా మారి, ఆయనకు సహాయం చేసాడు.

Ayyappa swamy temple in telugu-vavar masjid

సబరిమల అయ్యప్ప ఆలయానికి సమీపంలో, పంబ నది దగ్గర “వావర్ పల్లి” అనే ఒక ప్రత్యేక స్థలం ఉంది. ఇది వావర్‌ను స్మరించేందుకు మరియు ఆరాధించేందుకు నిర్మించబడింది. వావర్ పల్లిలో హిందూ భక్తులు, ముస్లిం భక్తులు ఇరువురూ సమానంగా సందర్శించి ప్రార్థనలు చేస్తారు.

ఈ కథ మరియు ఆచారం ద్వారా, శబరిమల తీర్థయాత్ర మత సామరస్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. హిందూ దేవుడు అయ్యప్ప మరియు ముస్లిం యోధుడు వావర్ మధ్య స్నేహం సోదరభావం మరియు ఐక్యతను సూచిస్తుంది.

-This is the Ayyappa Swamy History in Telugu, If any corrections needed please let us know in comments section

తరచుగా అడిగిన ప్రశ్నలు

అయ్యప్ప సుబ్రహ్మణ్యం స్వామి ఒక్కటేనా?

అయ్యప్ప స్వామి మరియు సుబ్రమణ్య స్వామి ఒక్కరే కాదు. అయ్యప్ప స్వామి శివుడు, విష్ణువు మొహినీ రూపంతో కలయికగా జన్మించినవారు, శబరిమలలో పూజించబడతారు. సుబ్రమణ్య స్వామి (మురుగన్/కార్తికేయ) శివ-పార్వతుల కుమారుడు, యుద్ధ దేవత. ఇద్దరికీ వేర్వేరు పూజా విధానాలు, కధలు ఉన్నాయి.

అయ్యప్ప ఏ యుగంలో జన్మించాడు?

అయ్యప్ప స్వామి కలియుగంలో జన్మించినట్టు హిందూ పురాణాలు చెబుతున్నాయి.

పంబ వద్ద ఇరుముడి పొందవచ్చా?

అవును, భక్తులు పంబ వద్ద ఇరుముడి పొందవచ్చు. అయితే, ఇది అక్కడి గురుస్వామి లేదా అర్హత కలిగిన వ్యక్తి ఆధ్వర్యంలోనే చేయాలి. ఇరుముడి తయారీకి సంబంధిత ఆచారాలు పాటించడం అవసరం.కానీ 41 రోజుల పాటు దీక్ష చేసి వెళ్ళటమే ఉత్తమం.

అయ్యప్ప అంటే ఏమిటి?

అయ్యప్ప అనే పదానికి అర్థం “అయ్య” (పూజనీయుడు లేదా గురువు) మరియు “అప్ప” (తండ్రి) కలయిక.

అదే విధంగా, అయ్యప్ప స్వామి హిందూ దేవత, శివుడు మరియు విష్ణువు మోహినీ అవతారంలా జన్మించినవారు.

అయ్యప్ప స్వామి పుట్టిన తేదీ?

అయ్యప్ప స్వామి పుట్టిన తేదీ గురించి స్పష్టమైన సమాచారం హిందూ పురాణాల్లో లేదా ఇతిహాసాల్లో పేర్కొనబడలేదు.

అయితే, అయ్యప్ప స్వామిని కలియుగంలో ధర్మస్థాపన కోసం అవతరించిన దేవతగా భావిస్తారు. ఆయన్ని ప్రత్యేకంగా శబరిమల మకరజ్యోతి సందర్భంగా పూజించటం ద్వారా జన్మదినానికి సాంప్రదాయ భావనను అనుసరిస్తారు. మకర సంక్రాంతి సమయం అయ్యప్ప స్వామి ప్రత్యేకతకు ప్రతీకగా భావించబడుతుంది.

అయ్యప్ప భక్తులు నల్ల దుస్తులు ఎందుకు ధరిస్తారు?

41 రోజుల పాటు దీక్ష చేసే అయ్యప్ప భక్తులు శనిదేవునికి గౌరవ సూచకంగా నల్లటి దుస్తులు ధరిస్తారు. మునుపటి తప్పు పనుల ప్రకారం ప్రజలకు ఇబ్బంది కలిగించే పనిని శనిదేవునికి అప్పగించారు. అతను ఏడు సంవత్సరాల పాటు ప్రజలపై తన దుష్ట దృష్టిని ఉంచాడని, ఆ సమయంలో ఆ వ్యక్తి చాలా సమస్యలను ఎదుర్కొంటాడని చెబుతారు. అతను తన గౌరవాన్ని కోల్పోతాడు మరియు అతని తప్పు ఏమీ లేకపోయిన నిందించబడతాడు మరియు తన సంపదను, ఆరోగ్యాన్ని కోల్పోతాడు. అతను తన ఆహారాన్ని సరిగ్గా తినలేడు మరియు ప్రాపంచిక ఆనందాలను ఆస్వాదించలేడు. సంక్షిప్తంగా చెప్పాలంటే, అతను ఆ కాలంలో జీవితాన్ని దుర్భరం చేస్తాడు.

అయ్యప్ప తన భక్తులను ఇబ్బంది నుండి తప్పించమని శనిని కోరాడు. కానీ శని ఇలా చెప్పాడు అతని చెడు కళ్ళ నుండి దేవతలు కూడా తప్పించుకోలేరు అని అలా చేయడం అతనికి సాధ్యం కాదు అని చెప్పాడు. అప్పుడు అయ్యప్ప తన భక్తులు, ఏడు సంవత్సరాలలో అనుభవించే శని ప్రతాపం,వారు చేసే 41 రోజుల దీక్షలో అదే సమస్యలను ఎదుర్కొంటారని చెప్పాడు.
అయ్యప్ప భక్తులు నల్ల దుస్తులు ధరిస్తారు, క్షౌరం చేయరు, చల్లటి నీటిలో స్నానం చేస్తారు, చెప్పులు లేకుండా నడుస్తారు మరియు రోజుకు ఒకసారి మాత్రమే ఆహారం తింటారు. కానీ అయ్యప్ప సేవ కోసం ఇదంతా ఆచారబద్ధంగా, భక్తిపూర్వకంగా చేసినప్పుడు, సమస్యలు దయనీయంగా ఉండవు, అందువల్ల భక్తులు రక్షించబడతారు.శనిభగవానుడు  దీనికి అంగీకరించాడు, అందువల్ల అయ్యప్ప స్వామి భక్తులు 41 రోజుల దీక్షను భక్తి తో నిర్వహించడం ద్వారా, వారు శని దోషం యొక్క హానికరమైన ప్రభావాల నుండి రక్షించబడతారని నమ్ముతారు. ఇది అయ్యప్ప భగవానుడికి, శనిదేవునికి మధ్య ఉన్న సంబంధం.

“కార్తీక పౌర్ణమి పండుగ ఎలా జరుపుకోవాలి ఇక్కడ చదవండి”

Images From : Leonardo.Ai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *